జనసేన కౌలు రైతు భరోసాకు మెగా బ్రదర్స్ మాతృమూర్తి సాయం
ABN , First Publish Date - 2022-06-26T02:21:45+05:30 IST
అమరావతి: జనసేన కౌలు రైతు భరోసాకు మెగా బ్రదర్స్ మాతృమూర్తి అంజనాదేవి ఆర్థిక సాయం చేశారు. పెన్షన్ డబ్బు నుంచి రూ. లక్షన్నరను ఆమె తన కుమారుడు
అమరావతి: జనసేన కౌలు రైతు భరోసాకు మెగా బ్రదర్స్ మాతృమూర్తి అంజనాదేవి ఆర్థిక సాయం చేశారు. పెన్షన్ డబ్బు నుంచి రూ. లక్షన్నరను ఆమె తన కుమారుడు పవన్ కళ్యాణ్కు అందజేశారు. పార్టీ కోసం మరో రూ.లక్ష విరాళంగా ఇచ్చారు. కొణిదెల వెంకట్రావు జయంతి సందర్భంగా ఈ విరాళం ఇచ్చారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ..‘‘ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో మా తండ్రి ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించి రిటైర్ అయ్యారు. పెన్షన్ డబ్బులను కౌలు రైతు కుటుంబాలను ఆదుకోవడానికి అమ్మ ఇవ్వడం చాలా ఆనందంగా ఉంది. పెన్షన్ డబ్బులను దాచి సహాయ కార్యక్రమాలకు ఇవ్వడం అమ్మకు అలవాటు. ఇవాళ కౌలు రైతు భరోసా యాత్ర ప్రత్యేక నిధికి విరాళంగా ఇచ్చింది. పెద్ద మనసుతో ఆమె చేసిన ఈ పనికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు.’’ అని పేర్కొన్నారు.