100వ పుట్టిన రోజు జరుపుకోబోతున్న మోదీ మాతృమూర్తి హీరాబెన్... గుజరాత్ ప్రభుత్వం అరుదైన కానుక...

ABN , First Publish Date - 2022-06-16T21:38:51+05:30 IST

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మాతృమూర్తి హీరాబెన్ 100వ

100వ పుట్టిన రోజు జరుపుకోబోతున్న మోదీ మాతృమూర్తి హీరాబెన్... గుజరాత్ ప్రభుత్వం అరుదైన కానుక...

గాంధీ నగర్ : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మాతృమూర్తి హీరాబెన్ 100వ పుట్టిన రోజును జరుపుకుంటున్న సందర్భంగా ఆమె కీర్తి, ప్రతిష్ఠలు శాశ్వతంగా నిలిచేందుకు ఓ రోడ్డుకు ఆమె పేరు పెట్టాలని గాంధీ నగర్ నగర పాలక సంస్థ నిర్ణయించింది. సేవా భావానికి సంబంధించిన పాఠాలను భావి తరాలు ఆమె జీవితం నుంచి నేర్చుకునేందుకు అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. 


గాంధీ నగర్ మేయర్ హితేశ్ మక్వానా బుధవారం విడుదల చేసిన అధికారిక ప్రకటనలో తెలిపిన వివరాల ప్రకారం, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మాతృమూర్తి హీరాబెన్ మోదీ 100వ పుట్టిన రోజును జూన్ 18న జరుపుకుంటారు. ఈ సందర్భంగా గుజరాత్ రాజధాని నగరం గాంధీ నగర్ ప్రజల కోరికను, వారి భావాలను దృష్టిలో ఉంచుకుని ఓ రోడ్డుకు ఆమె పేరు పెట్టాలని నిర్ణయించారు. రేసన్ పెట్రోలు బంకు నుంచి 80 మీటర్ల పొడవుగల మార్గానికి ‘‘పూజ్య హీరాబెన్  మార్గ్’’ అని పేరు పెట్టాలని నిర్ణయించినట్లు చెప్పారు. త్యాగం, తపన, సేవ, అంకిత భావంతో పని చేయడం వంటి అంశాలను ఆమె జీవితం నుంచి భావితరాలు నేర్చుకోవడం కోసం, ఆమె కీర్తి, ప్రతిష్ఠలు శాశ్వతంగా నిలిచిపోవడం కోసం ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. 


Updated Date - 2022-06-16T21:38:51+05:30 IST