ఆమె ముగ్గురు పిల్లలకు తల్లి.. భర్త సోదరుడితో ప్రేమాయణం.. చివరకు వారి పరిస్థితి ఏమైందంటే..

ABN , First Publish Date - 2022-03-01T20:23:28+05:30 IST

ఆమెకు ఎనిమిదేళ్ల క్రితం వివాహమైంది.. ఇద్దరు కూతుళ్లు, ఒక కొడుకు ఉన్నారు..

ఆమె ముగ్గురు పిల్లలకు తల్లి.. భర్త సోదరుడితో ప్రేమాయణం.. చివరకు వారి పరిస్థితి ఏమైందంటే..

ఆమెకు ఎనిమిదేళ్ల క్రితం వివాహమైంది.. ఇద్దరు కూతుళ్లు, ఒక కొడుకు ఉన్నారు.. రోజూ పొలం పనులకు వెళ్లే ఆ మహిళ అక్కడ భర్త సోదరుడితో ప్రేమలో పడింది.. అతడితో వివాహేతర సంబంధం పెట్టుకుంది.. ఇద్దరూ కలిసి జీవించాలనుకున్నారు.. అయితే అందుకు ధైర్యం సరిపోలేదు.. దీంతో ఇద్దరూ కలిసి బావిలోకి దూకి ఆత్మహత్య చేసుకున్నారు. రాజస్థాన్‌లోని బార్మర్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. 


బార్మర్ జిల్లాలోని ఆల్మసార్ గ్రామానికి చెందిన సవిత (26) అనే మహిళ ఎనిమిదేళ్ల క్రితం వీరారామ్ అనే వ్యక్తిని వివాహం చేసుకుంది. ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చింది. పిల్లలు పాఠశాలకు వెళ్లిపోయాక ఆమె రోజూ పొలం పనులకు వెళ్లేది. వారి పొలం పక్కనే భర్త సోదరుడు నేనారామ్ పొలం కూడా ఉండేది. అతడు కూడా రోజూ సవితతో పాటు పొలం పనులు చేసేవాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగింది. అది వివాహేతర సంబంధానికి దారి తీసింది. 


ఇద్దరూ వేరే ఊరు వెళ్లిపోయి కలిసి జీవించాలనుకున్నారు. అయితే పిల్లలను వదిలేసి వెళ్లడం ఆమెకు ఇష్టం లేదు. ఇద్దరూ ఒకరిని విడిచి మరొకరు ఉండలేని స్థితికి చేరుకున్నారు. కలిసి బతకలేం కాబట్టి కలిసి చనిపోదాం అనుకున్నారు. సోమవారం రాత్రి గ్రామంలోని ఓ బావిలోకి దూకి చనిపోయారు. ఉదయానికి ఆ విషయం కుటుంబ సభ్యులకు తెలిసింది. సమాచారం అందుకున్న పోలీసులు మ‌‌ృతదేహాలను పోస్ట్‌మార్టమ్‌కు తరలించారు. 


Updated Date - 2022-03-01T20:23:28+05:30 IST