భర్తను, పిల్లలను వదిలేసి వేరే యువకుడితో భార్య జంప్.. పోలీసులకు ఫిర్యాదు చేసిన భర్త.. పారిపోయిన జంటను పట్టుకున్న పోలీసులు ఇచ్చిన తీర్పు ఏంటంటే..

ABN , First Publish Date - 2021-12-21T17:56:15+05:30 IST

ఆమె వివాహిత.. ఇద్దరు పిల్లలకు తల్లి.. అయినా మరో యువకుడితో ప్రేమలో పడి ఇల్లు వదిలేసి వెళ్లిపోయింది..

భర్తను, పిల్లలను వదిలేసి వేరే యువకుడితో భార్య జంప్.. పోలీసులకు ఫిర్యాదు చేసిన భర్త.. పారిపోయిన జంటను పట్టుకున్న పోలీసులు ఇచ్చిన తీర్పు ఏంటంటే..

ఆమె వివాహిత.. ఇద్దరు పిల్లలకు తల్లి.. అయినా మరో యువకుడితో ప్రేమలో పడి ఇల్లు వదిలేసి వెళ్లిపోయింది.. దీంతో ఆ భర్త పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశాడు.. మూడ్రోజుల్లో ఆ జంటను పోలీసులు పట్టుకున్నారు.. పోలీస్ స్టేషన్‌లోనే పంచాయితీ నిర్వహించి తీర్పు ఇచ్చేశారు.. ఇద్దరు పిల్లలను కూడా ఆ మహిళకే అప్పగించి ప్రియుడితో పంపేశారు.. దీంతో ఆ భర్త కోర్టును ఆశ్రయించనున్నాడు.. ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌లో ఈ ఘటన జరిగింది. 


గోరఖ్‌పూర్‌కు సమీపంలో హర్‌పూర్‌కు చెందిన వివాహిత అదే గ్రామానికి చెందిన యువకుడితో ప్రేమలో పడింది. ఇద్దరు పిల్లల తల్లి అయిన ఆమె వారిని ఇంటి దగ్గరే వదిలేసి గత గురువారం ఆ యువకుడితో పాటు వెళ్లిపోయింది. దీంతో ఆ మహిళ భర్త పోలీసులను ఆశ్రయించాడు. ఆ జంటను సోమవారం నాడు పోలీసులు పట్టుకున్నారు. ఆ మహిళ భర్తను కూడా స్టేషన్‌ను పిలిపించి పంచాయితీ నిర్వహించారు. 


తన భర్త ప్రవర్తన తనకు నచ్చడం లేదని, అందుకే ప్రియుడితో కలిసి వెళ్లిపోయానని ఆ మహిళ చెప్పింది. తన పిల్లలను తనకు అప్పగించమని కోరింది. పిల్లలను చూసుకుంటానని ఆమె ప్రియుడు కూడా పోలీసులకు చెప్పాడు. దీంతో ఇద్దరు పిల్లలను కూడా పోలీసులు ఆమెకే అప్పగించారు. షాకైన భర్త కోర్టును ఆశ్రయించేందుకు సిద్ధమవుతున్నాడు. 

Updated Date - 2021-12-21T17:56:15+05:30 IST