పిల్లాడిని వీపుకు కట్టుకొని.. రోడ్లు ఊడుస్తున్న తల్లి.. నెట్టింట వీడియో వైరల్

ABN , First Publish Date - 2022-06-01T08:36:23+05:30 IST

ఈ సృష్టిలో అత్యంత గొప్ప బంధం తల్లీబిడ్డల బంధం. ఈ విషయాన్ని ఎన్నో ఘటనలు రుజువు చేశాయి. తాజాగా ఒడిశాలో వెలుగు చూసిన ఘటన కూడా అలాంటిదే. ఇక్కడి మయూర్‌భంజ్‌లో రోడ్లు ఊడ్చే లక్ష్మీ ముఖి అనే మహిళ దాదాపు పదేళ్లుగా మున్సిపాలిటీలో స్వీపర్‌గా...

పిల్లాడిని వీపుకు కట్టుకొని.. రోడ్లు ఊడుస్తున్న తల్లి.. నెట్టింట వీడియో వైరల్

ఈ సృష్టిలో అత్యంత గొప్ప బంధం తల్లీబిడ్డల బంధం. ఈ విషయాన్ని ఎన్నో ఘటనలు రుజువు చేశాయి. తాజాగా ఒడిశాలో వెలుగు చూసిన ఘటన కూడా అలాంటిదే. ఇక్కడి మయూర్‌భంజ్‌లో రోడ్లు ఊడ్చే లక్ష్మీ ముఖి అనే మహిళ దాదాపు పదేళ్లుగా మున్సిపాలిటీలో స్వీపర్‌గా ఉద్యోగం చేస్తోంది. 


ఇటీవలి కాలంలో తన పసివాడిని వీపుకు కట్టుకొని రోడ్లు ఊడుస్తున్న ఆమె వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. తన ఇంట్లో ఎవరూ ఉండరని, అందుకే తన బిడ్డను ఇలా వెంట తెచ్చుకుంటున్నానని లక్ష్మీ చెప్తోంది. అంతేకాదు, ఇలా బిడ్డను మోసుకుంటూ పని చేస్తున్నా కూడా తనకేం కష్టంగా లేదని, అది తన బాధ్యతని గర్వంగా చెప్పిందా అమ్మ. 


ఈ విషయమై స్థానిక మున్సిపాలిటీ చైర్మన్ బాదల్ మొహంతిని సంప్రదించగా.. వ్యక్తిగత కారణాలతో లక్ష్మీ ఇలా తన బిడ్డతో కలిసి పనికి వస్తోందని చెప్పారు. ఆమెకు అన్ని రకాలుగా సహాయసహకారాలు అందించాలని తమ అధికారులను ఆదేశించినట్లు ఆయన తెలిపారు. సోషల్ మీడియాలో ఈ వీడియో చూసిన ఎంతో మంది ఆ తల్లికి నమస్కరిస్తున్నారు. ‘‘ఈ గౌరవప్రదమేన మహిళ పట్టుదలకు నేను తలవంచి నమస్కరిస్తున్నా...’’ అని కొందరు కామెంట్లు చేస్తుంటే.. మరికొందరేమో ‘‘ఆ పసికందు చదువు కోసమైనా మనం ఏమైనా చెయ్యగలమా?’’ అని ప్రశ్నిస్తున్నారు.




Updated Date - 2022-06-01T08:36:23+05:30 IST