ముంపు బాధితులను సీఎం పరామర్శించకపోవడం శోచనీయం : మోత్కుపల్లి

ABN , First Publish Date - 2020-10-27T10:06:48+05:30 IST

హైదరాబాద్‌లో ఇటీవల కురిసిన భారీ వర్షాల నేపథ్యంలో నీటమునిగిన బస్తీల్లోని ఇళ్లను సీఎం కేసీఆర్‌ పర్యటించి పరామర్శించకపోవడం శోచనీయమని మాజీ మంత్రి

ముంపు బాధితులను సీఎం పరామర్శించకపోవడం శోచనీయం : మోత్కుపల్లి

కవాడిగూడ, అక్టోబర్‌ 26 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌లో ఇటీవల కురిసిన భారీ వర్షాల నేపథ్యంలో నీటమునిగిన బస్తీల్లోని ఇళ్లను సీఎం కేసీఆర్‌ పర్యటించి పరామర్శించకపోవడం శోచనీయమని మాజీ మంత్రి, బీజేపీ సీనియర్‌ నాయకుడు మోత్కుపల్లి నర్సింహులు అన్నారు. ఆదివారం మధ్యాహ్నం లోయర్‌ ట్యాంక్‌బండ్‌లోని అంబేడ్కర్‌ విగ్రహం వద్ద మోత్కుపల్లి నర్సింహులు నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వరదలతో నష్టపోయిన హైదరాబాద్‌ ప్రజలను సీఎం కేసీఆర్‌ పరామర్శించాలని డిమాండ్‌ చేశారు. ఈ నిరసనలో బీజేపీ నాయకురాలు బంగారు శ్రుతి, నాయకులు పాల్గొన్నారు.   

Updated Date - 2020-10-27T10:06:48+05:30 IST