మోటారు సైకిల్‌ ఢీకొని వృద్ధుడి మృతి

ABN , First Publish Date - 2021-01-25T05:58:43+05:30 IST

రోడ్డుపక్కన నిల్చున్న ఓ వృద్ధుడిని మోటారుసైక్లిస్ట్‌ వేగంగా ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందిన ఘటన తాడేపల్లిగూడెంలోని తణుకు రోడ్డులో ఆదివారం జరిగింది.

మోటారు సైకిల్‌ ఢీకొని వృద్ధుడి మృతి

తాడేపల్లిగూడెం క్రైం, జనవరి 24: రోడ్డుపక్కన నిల్చున్న ఓ వృద్ధుడిని మోటారుసైక్లిస్ట్‌ వేగంగా ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందిన ఘటన తాడేపల్లిగూడెంలోని తణుకు రోడ్డులో ఆదివారం జరిగింది. స్థానికులు, పోలీసు లు తెలిపిన వివరాల ప్రకారం.. పాతూరుకు చెందిన ఎం.బాలయ్య (60) జువ్వలపాలెంలోని ఓ బార్‌లో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తుంటాడు. పనిలో భాగంగా ఆ ప్రాంతంలో నిల్చున్న వ్యక్తిని ప్రత్తిపాడుకు చెందిన మోటారుసైక్లిస్ట్‌ వేగంగా వచ్చి ఢీకొట్టడంతో తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే 108 వాహనంలో ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు.  ద్విచక్ర వాహనదారుడు బైక్‌ వదిలి పరారయ్యాడు. ఈమేరకు కేసు నమోదు చేసి దర్యాప్తుచేస్తున్నట్టు ఎస్‌ఐ గుర్రయ్య తెలిపారు.

Updated Date - 2021-01-25T05:58:43+05:30 IST