పీఆర్సీపై ప్రభుత్వంలో కదలిక
ABN , First Publish Date - 2021-12-03T00:06:46+05:30 IST
పీఆర్సీపై ప్రభుత్వంలో కదలిక వచ్చింది. ఉద్యోగసంఘాల
అమరావతి: పీఆర్సీపై ప్రభుత్వంలో కదలిక వచ్చింది. ఉద్యోగసంఘాల ఉద్యమ కార్యాచరణతో ఏపీ ప్రభుత్వం దిగొచ్చింది. రేపు మ.2 గంటలకు ఏపీ సివిల్ సర్వీసెస్ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ భేటీ కానుంది. భేటీకి హాజరుకావాలని ఉద్యోగసంఘాల నేతలకు సమాచారం అందించారు. పీఆర్సీపై ఉద్యోగులతో చర్చలు ఉంటాయని ప్రభుత్వం పేర్కొంది. ఉద్యోగసంఘాలకు జీఏడీ ప్రిన్సిపల్ సెక్రటరీ శశిభూషణ్ సమాచారం అందించారు.