ఉదయగిరి జిల్లా సాధనకు ఉద్యమం

ABN , First Publish Date - 2020-07-06T10:39:13+05:30 IST

కడప, ప్రకాశం, నెల్లూరు జిల్లాలోని 18 మెట్ట మండలాలను కలిపి ఉదయగిరి కేంద్రంగా జిల్లా ప్రకటించాలని..

ఉదయగిరి జిల్లా సాధనకు ఉద్యమం

ఉదయగిరి రూరల్‌, జూలై 5: కడప, ప్రకాశం, నెల్లూరు జిల్లాలోని 18 మెట్ట మండలాలను కలిపి ఉదయగిరి కేంద్రంగా జిల్లా ప్రకటించాలని ప్రతిఒక్కరూ ఉద్యమించాలని జేవీవీ, జిల్లా సాధన సమితి నాయకులు పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆదివారం బిజ్జంపల్లి గ్రామంలో పోస్టుకార్డు ఉద్యమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ తాగు, సాగునీరు, విద్య, వైద్య రంగాల్లో ఉదయగిరి అభివృద్ధి చెందాలంటే ఉదయగిరిని జిల్లా చేయడం ఒక్కటే మార్గమన్నారు. అనంతరం కరపత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో జేవీవీ నాయకులు దస్తగిరి అహ్మద్‌, రామిరెడ్డి, కల్లూరి రమణారెడ్డి, షేక్‌ గాజుల ఫారుఖ్‌అలి, గౌస్‌బాషా, జిలానిబాషా, కాశిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.  

Updated Date - 2020-07-06T10:39:13+05:30 IST