ఎంపీలు నల్లచొక్కాలు వేసుకొని నల్లికుట్ల పనిచేశారు: ఎంపీ అర్వింద్
ABN , First Publish Date - 2021-12-07T23:27:47+05:30 IST
టీఆర్ఎస్ ఎంపీలు నల్లచొక్కాలు వేసుకొని నల్లికుట్ల పనిచేశారని ఎంపీ అర్వింద్ మండిపడ్డారు. కేసీఆర్, కేటీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని చౌరస్తాపై వదిలేశారని విమర్శించారు.
ఢిల్లీ: టీఆర్ఎస్ ఎంపీలు నల్లచొక్కాలు వేసుకొని నల్లికుట్ల పనిచేశారని ఎంపీ అర్వింద్ మండిపడ్డారు. కేసీఆర్, కేటీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని చౌరస్తాపై వదిలేశారని ఆయన విమర్శించారు. రైతుల శ్రమతో కేసీఆర్, కేటీఆర్, రైస్ మిల్లర్లు జేబులు నింపుకుంటున్నారని ఆరోపించారు. రైతుల కోసం టీఆర్ఎస్ ఎంపీలు రాజీనామా చేయాలని అర్వింద్ డిమాండ్ చేశారు.