ఎంపీ అరవింద్ పిల్లలతో సరదాగా గడిపిన మోదీ

ABN , First Publish Date - 2021-08-18T18:36:07+05:30 IST

హైదరాబాద్: క్షణం తీరిక లేకుండా గడిపే ప్రధాని మోదీ.. మంగళవారం ఎంపీ అరవింద్ పిల్లలతో సరదాగా గడిపారు. మామూలుగానే పిల్లలంటే ఇష్టపడే మోదీ..

ఎంపీ అరవింద్ పిల్లలతో సరదాగా గడిపిన మోదీ

హైదరాబాద్: క్షణం తీరిక లేకుండా గడిపే ప్రధాని మోదీ.. మంగళవారం ఎంపీ అరవింద్ పిల్లలతో సరదాగా గడిపారు. మామూలుగానే పిల్లలంటే ఇష్టపడే మోదీ.. ఎంపీ పిల్లలతో కలిసిపోయి, చాలా సేపు ముచ్చటించారు. పిల్లల చదువు, క్రీడలు తదితర అంశాలపై వివరాలు అడిగి మరీ తెలుసుకున్నారు. మోదీయే స్వయంగా అరవింద్ పిల్లలకు స్వీట్లు అందించారు. ప్రధాని స్థానంలో ఉన్న మోదీ.. తమ పిల్లలతో గడిపిన క్షణాలు ఎప్పటికీ మరచిపోలేనని ఎంపీ అరవింద్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

 

 నిజామాబాద్ ఎంపీ అరవింద్.. కుటుంబసమేతంగా ప్రధాని నరేంద్రమోదీని కలిశారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ.. తమ వివాహ వార్షికోత్సవం సందర్భంగా మంగళవారం ప్రధానిని కలిశామని.. చాలా సంతోషంగా ఉందని పేర్కొన్నారు. తమ పిల్లలు సమన్యు(12), రుద్రాక్ష్ (4)తో ప్రధాని చాలా సేపు ముచ్చటించారని తెలిపారు. చిన్నవాడైన రుద్రాక్ష్‌తో సరదాగా గడిపారని.. సమన్యుని తన చదువు, క్రీడలపై ఆసక్తి గురించి వివరాలు తెలుసుకున్నారని ఎంపీ అరవింద్ పేర్కొన్నారు.





Updated Date - 2021-08-18T18:36:07+05:30 IST