పుణ్య నదిలో పేలుళ్లు... పెల్లుబుకుతున్న నిప్పురవ్వలు, పొగ!

ABN , First Publish Date - 2021-03-08T12:05:44+05:30 IST

మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలోగల క్షిప్రా పుణ్యనదిలో...

పుణ్య నదిలో పేలుళ్లు... పెల్లుబుకుతున్న నిప్పురవ్వలు, పొగ!

ఉజ్జయిని: మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలోగల క్షిప్రా పుణ్యనదిలో ఇటీవల కొంతకాలంగా పేలుళ్లు సంభవిస్తుండటంతో స్థానిక అధికారులు అప్రమత్తమయ్యారు. క్షిప్రా నది వద్ద త్రివేణి స్టాప్ డ్యామ్ సమీపంలో నిర్మిస్తున్న ఘాట్ ఎదురుగా ఉన్న నదీప్రాంతంలో పేలుళ్లు సంభవిస్తున్నాయి. ఈ సమయంలో నదిలో నుంచి నిప్పు రవ్వలు ఎగసిపడటంతోపాటు పొగ కూడా వస్తోంది. ఫిబ్రవరి 26న తొలి పేలుడు సంభవించగా ఆ తరువాత ప్రతిరోజూ ఏదోఒక సమయంలో పేలుళ్లు చోటుచేసుకుంటున్నాయి. 


ఈ పేలుళ్లు జరుగుతున్న ప్రాంతానికి కొద్ది దూరంలోనే భక్తులు పుణ్య స్నానాలు ఆచరిస్తున్నారు. తరచూ నదిలో పేలుళ్లు సంభవిస్తుండటంతో స్థానికులు భయభ్రాంతులకు గురవుతున్నారు. ఈ నేపధ్యంలో జిల్లా కలెక్టర్ ఆశీష్ సింగ్ ఈ ప్రాంతాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ క్షిప్రా నదికి సంబంధించిన త్రివేణి ఘాట్ వద్ద పేలుళ్లు చోటుచేసుకుంటున్నాయని, గడచిన ఐదురోజుల్లో నాలుగైదుసార్లు పేలుళ్లు చోటుచేసుకున్నాయన్నారు. ఈ విషయమై జియోలాజకల్ సర్వే ఆఫ్ ఇండియాకు లేఖ రాశానన్నారు. అయితే భూగర్భ శాస్త్రవేత్తలు... భూమిలోపల మార్పుల కారణంగానే ఈ విధమైన పేలుళ్లు సంభవిస్తున్నాయనే అభిప్రాయం వ్యక్తం చేశారు.

                                           ‘ఇండియా స్పెషల్’ సౌజన్యంతో...

Updated Date - 2021-03-08T12:05:44+05:30 IST