పసుపు రైతుని ఆదుకోండి.. కేసీఆర్కు అర్వింద్ లేఖ
ABN , First Publish Date - 2022-01-09T03:56:00+05:30 IST
సుపు రైతులను ఆదుకోవాలని సీఎం కేసీఆర్కు ఎంపీ ధర్మపురి అర్వింద్ లేఖ రాశారు. అధిక వర్షాలతో...
నిజామాబాద్: పసుపు రైతులను ఆదుకోవాలని సీఎం కేసీఆర్కు ఎంపీ అర్వింద్ లేఖ రాశారు. అధిక వర్షాలతో దిగుబడి తగ్గి, తెగుళ్ల సమస్యతో, వచ్చిన దిగుబడికి కూడా ధర వచ్చేలా లేదని, కనీసం పెట్టిన పెట్టుబడి కూడా వచ్చేలా కనిపించట్లేదని దిగాలు పడుతున్న పసుపు రైతులకు తక్షణమే పంట నష్టం అంచనాలు వేసి, పరిహారం చెల్లించాలని ఆయన లేఖలో పేర్కొన్నారు. ప్రధాన మంత్రి ఫసల్ భీమా యోజనని రాష్ట్రంలో అమలు చేసి ఉంటే, రైతులకు ఈ సమయంలో ఉపశమనం లభించి ఉండేదని అర్వింద్ అభిప్రాయం వ్యక్తం చేశారు.