నారా లోకేష్‌పై ఎంపీ గోరంట్ల మాధవ్ విమర్శలు

ABN , First Publish Date - 2022-06-29T00:20:40+05:30 IST

శ్రీ సత్యసాయి జిల్లా: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు నారా లోకేష్‌పై హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ వ్యక్తిగత విమర్శలకు దిగారు.

నారా లోకేష్‌పై ఎంపీ గోరంట్ల మాధవ్ విమర్శలు

శ్రీ సత్యసాయి జిల్లా: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు నారా లోకేష్‌ను హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ విమర్శించారు. ’’స్కూల్ లీడర్‌గా కూడా గెలవలేని లోకేష్‌ను మంగళగిరి ప్రజలు ఓడించారు. లోకేష్ పాదయాత్ర చేసినా, పవన్ కళ్యాణ్  బస్ యాత్ర చేసినా, చంద్ర‌బాబు కాశీ యాత్ర చేసినా, సీఎం జగన్ జైత్ర యాత్రను ఆపలేరు. ఇలాంటోళ్ల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండి వచ్చే ఎన్నికల్లో వైసీపీని 175 స్థానాల్లో గెలిపించాలి.‘‘ అని  ఎంపీ కోరారు.

Updated Date - 2022-06-29T00:20:40+05:30 IST