మధ్యప్రదేశ్ రైతుల ఖాతాల్లోకి పీఎం కిసాన్ పథకం కింద రూ.4వేల బదిలీ

ABN , First Publish Date - 2020-09-23T15:21:51+05:30 IST

ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం కింద మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని రైతుల ఖాతాల్లోకి రూ.4వేలు చొప్పున రెండు విడతల నగదును బదిలీ చేస్తున్నట్లు...

మధ్యప్రదేశ్ రైతుల ఖాతాల్లోకి పీఎం కిసాన్ పథకం కింద రూ.4వేల బదిలీ

భోపాల్ (మధ్యప్రదేశ్): ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం కింద మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని రైతుల ఖాతాల్లోకి రూ.4వేలు చొప్పున రెండు విడతల నగదును బదిలీ చేస్తున్నట్లు మధ్యప్రదేశ్ రాష్ట్ర మంత్రి నరోత్తం మిశ్రా చెప్పారు. రైతులకు సహాయం చేసేందుకు తాము వారి ఖాతాల్లోకి నగదును బదిలీ చేశామని సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ చెప్పారు. 2022 వ సంవత్సరంకల్లా రైతుల ఆదాయాన్ని పెంచుతామని సీఎం చెప్పారు. రైతులకు జీరో వడ్డీతో రుణాలు ఇస్తున్నామని సీఎం పేర్కొన్నారు.

Updated Date - 2020-09-23T15:21:51+05:30 IST