Gorantla madhav వ్యవహారంపై ప్రధానికి ఎంపీ జస్బీర్‌సింగ్ లేఖ

ABN , First Publish Date - 2022-08-11T20:05:18+05:30 IST

వైసీపీ ఎంపీ గోరంటల్ మాధవ్ వ్యవహారంపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి ఎంపీ జస్బీర్‌సింగ్ గిల్ లేఖ రాశారు.

Gorantla madhav వ్యవహారంపై ప్రధానికి ఎంపీ జస్బీర్‌సింగ్ లేఖ

న్యూఢిల్లీ: వైసీపీ ఎంపీ గోరంటల్ మాధవ్ (Gorantla madhav) వ్యవహారంపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra modi)కి ఎంపీ జస్బీర్‌సింగ్ గిల్ (Jasbir Singh Gill) లేఖ రాశారు. ప్రధానితో పాటు లోక్‌సభ స్పీకర్, జాతీయ మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌కు ఎంపీ లేఖ రాశారు. గోరంట్ల(YCP MP) వ్యవహారం పార్లమెంట్ వ్యవస్థను దెబ్బతీసేలా ఉందని లేఖలో తెలిపారు. పార్లమెంట్ ఎంపీలకు మాయని మచ్చలా ఉందని లేఖలో పేర్కొన్నారు. ఎంపీ అంటే మేల్ ప్రాస్టిట్యూట్ అని అంటున్నారన్నారు. గోరంట్ల మాధవ్ వీడియో ఫోరెన్సిక్‌కు వెళ్లిందని ఎంపీ భరత్ అన్నారని తెలిపారు. గోరంట్ల వ్యవహారంపై ఒక్కొక్కరు ఒక్కోలా మాట్లాడుతున్నారని ఎంపీ జస్బీర్‌సింగ్ లేఖలో పేర్కొన్నారు. 





Updated Date - 2022-08-11T20:05:18+05:30 IST