Rajeev హంతకులను హీరోలుగా చేయొద్దు
ABN , First Publish Date - 2022-05-13T15:42:43+05:30 IST
మాజీ ప్రధాని రాజీవ్గాంధీ హత్యకేసు నిందితులను హీరోలను చేయవద్దని కాంగ్రెస్ ఎంపీ కార్తీ చిదంబరం ట్వీట్ చేశారు. ఈ కేసులో 30 ఏళ్లుగా యావజ్జీవశిక్ష అనుభవిస్తున్న
- ఎంపీ కార్తీ చిదంబరం
పెరంబూర్(చెన్నై): మాజీ ప్రధాని రాజీవ్గాంధీ హత్యకేసు నిందితులను హీరోలను చేయవద్దని కాంగ్రెస్ ఎంపీ కార్తీ చిదంబరం ట్వీట్ చేశారు. ఈ కేసులో 30 ఏళ్లుగా యావజ్జీవశిక్ష అనుభవిస్తున్న పేరరివాలన్ తనను విడుదల చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్ విచారణ పూర్తిచేసిన సుప్రీంకోర్టు, తేది ప్రకటించకుండా తీర్పు వాయిదావేసింది. ఈ నేపథ్యంలో, డీఎంకే ఎంపీ సెంథిల్ కుమార్ తన ఫేస్బుక్లో, చేతిలో పావురంతో పేరరివాలన్ ఫొటో ఉంచి ‘ముందస్తు శుభాకాంక్షలు’ అంటూ పోస్ట్ చేశారు. దీనిపై స్పందించిన కాంగ్రెస్ ఎంపీ కార్తీ చిదంబరం గత ఏడాది ఏడుగురు విడుదల వ్యవహారంలో తాను చెప్పిన మాటలతో కూడిన దృశ్యాలు పోస్ట్ చేశారు. రాజీవ్తో పాటు మృతిచెందిన ఇతరుల గురించి ఎవ్వరూ మాట్లాడడం లేదు. హత్యా నిందితులను హీరోలను చేయొద్దని పోస్ట్ చేశారు. ఈ పోస్ట్పై కాంగ్రెస్ కార్యకర్తలు ‘ఈయన ఒక్కరైనా రాజీవ్గాంధీ కోసం గళం విప్పుతున్నారు’ అంటూ కామెంట్స్ చేశారు.