MP Komatireddy: సెప్టెంబర్ 17 తెలంగాణకు నిజమైన స్వాతంత్ర్యం వచ్చిన రోజు

ABN , First Publish Date - 2022-09-17T18:40:12+05:30 IST

సెప్టెంబర్ 17 తెలంగాణకు నిజమైన స్వాతంత్ర్యం వచ్చిన రోజని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు.

MP Komatireddy: సెప్టెంబర్ 17 తెలంగాణకు నిజమైన స్వాతంత్ర్యం వచ్చిన రోజు

యాదాద్రి: సెప్టెంబర్ 17 తెలంగాణకు నిజమైన స్వాతంత్ర్యం వచ్చిన రోజని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (Komatireddy venkat reddy) అన్నారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ... రజాకార్లను తరిమికొట్టడంలో నల్గొండ జిల్లా ప్రముఖ పాత్ర పోషించిందని గుర్తుచేశారు. .సెప్టెంబర్ 17ను విమోచన దినోత్సవంగా జరుపుతామని ఉద్యమ సమయంలో కేసీఆర్ (CM KCR) ప్రగల్భాలు పలికి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చాక మాట మార్చారని మండిపడ్డారు. రాష్ట్రంలో కాంగ్రెస్ (Congress) అధికారంలోకి రాగానే సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహిస్తామని స్పష్టం చేశారు. నిజాం, రజాకార్లను తరిమికొట్టడంలో కాంగ్రెస్, కమ్యూనిస్టుల పోరాటం వెలకట్టలేనిదని కొనియాడారు. సాయుధ రైతాంగ పోరాటంతోనే నిజాం తోకముడిచిండని కోమటిరెడ్డి వెంకటరెడ్డి (Congress MP) అన్నారు. 

Updated Date - 2022-09-17T18:40:12+05:30 IST