వడపర్తిలో ఇంకా బోర్ నీళ్లే: ఎంపీ కోమటిరెడ్డి
ABN , First Publish Date - 2022-01-25T21:11:58+05:30 IST
జిల్లాలోని ప్రతి గ్రామానికి మిషన్ భగీరథ నీళ్లు ఇవ్వకుంటే ఓట్లు అడగననని
యాదాద్రి: జిల్లాలోని ప్రతి గ్రామానికి మిషన్ భగీరథ నీళ్లు ఇవ్వకుంటే ఓట్లు అడగననని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి పేర్కొన్నారు. మరి వడపర్తి గ్రామంలో ఇంకా బోర్ నీళ్లే వస్తున్నాయని, దీనికి సీఎం సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. గ్రామంలో ఒక్క నల్లా కనెక్షన్ ఇవ్వలేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల కోసం ఇప్పుడు విద్యావ్యవస్థపై ఆలోచన వచ్చిందా అని ఆయన ప్రభుత్వాన్ని నిలదీశారు. రాష్ట్రంలో ఫీజు రీయింబర్స్మెంట్, ఆరోగ్యశ్రీలను గాలికి వదిలేశారని ఆయన ఆరోపించారు.