రీమోడలింగ్ పనులను కొనసాగించాలని వినతి
ABN , First Publish Date - 2021-11-26T06:18:16+05:30 IST
గుంటూరు రైల్వేస్టేషన్ రీమోడలింగ్ ప్రాజెక్టు పనులను కొనసాగించాలని నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు రైల్వేశాఖ మంత్రి అశ్వినివిష్ణవ్ను కోరారు.
గుంటూరు, నవంబరు 25: గుంటూరు రైల్వేస్టేషన్ రీమోడలింగ్ ప్రాజెక్టు పనులను కొనసాగించాలని నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు రైల్వేశాఖ మంత్రి అశ్వినివిష్ణవ్ను కోరారు. ఈ మేరకు ఢిల్లీలో ఆయన్ను కలిసి పలు అంశాలపై చర్చించారు. ఎన్నో ఏళ్ల తర్వాత గుంటూరుకు కేటాయించిన రూ.80 కోట్లను రద్దు చేయడం సరికాదన్నారు. రాష్ట్రంలోనే ఎంతో ప్రాధాన్యం ఉన్న గుంటూరు రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులు కొనసాగించాలన్నారు. ఆర్యూబీలు, ఆర్వోబీ నిర్మాణాలు, లెవల్ క్రాసింగ్ గేట్ల గురించి వివరించారు. ఇంటర్ సిటీ ఎక్స్ప్రెస్ నడికుడిలో ఆపాలని, ఫలక్నుమా సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ను సత్తెనపల్లిలో ఆపాలని కోరారు.