తిన్నది అరగక పాదయాత్రలు: ఎంపీ కవిత
ABN , First Publish Date - 2022-02-03T21:57:35+05:30 IST
తిన్నది అరగకనే ప్రతిపక్ష నాయకులు పాదయాత్రలు చేస్తున్నారని టీఆర్ఎస్
ఢిల్లీ: తిన్నది అరగకనే ప్రతిపక్ష నాయకులు పాదయాత్రలు చేస్తున్నారని టీఆర్ఎస్ ఎంపీ మాలోత్ కవిత అన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్కు 95 నుంచి 105 సీట్లు వస్తాయని కేసీఆర్ అనడంతో బీజేపీ, కాంగ్రెస్లో వణుకు పుడుతోందన్నారు. ఇప్పటి పరిస్థితులకు అనుకూలంగా రాజ్యాంగం ఉండాలని కేసీఆర్ చెప్పారని ఆమె పేర్కొన్నారు. ఆదానీ, అంబానీలకు మేలు చేసే విధంగానే బడ్జెట్ ఉందని ఆమె ఆరోపించారు.