పార్లమెంట్ సభ్యులందరికీ ఎంపీ Raghurama లేఖ
ABN , First Publish Date - 2022-07-07T16:59:32+05:30 IST
పార్లమెంట్ సభ్యులందరికీ ఎంపీ రఘురామకృష్ణ రాజు లేఖ రాశారు.
న్యూఢిల్లీ/అమరావతి: పార్లమెంట్ (Parliament) సభ్యులందరికీ ఎంపీ రఘురామకృష్ణ రాజు (Raghurama krishna raju) లేఖ రాశారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి (Jagan mohan reddy) అధికార దుర్వినియోగం చేసి తనపై కేసులు నమోదు చేస్తున్నారని తెలిపారు. ఏపీ ప్రభుత్వం (AP government) దేశద్రోహం కేసు నమోదు చేసి సీబీ.. సీఐడీ అధికారులతో కస్టోడియల్ టార్చర్ చేశారన్నారు. తాజాగా మరోసారి తన నివాసం వద్ద పోలీసులు(Police) రెక్కీ నిర్వహించారని ఎంపీ రఘురామ కృష్ణరాజు లేఖలో పేర్కొన్నారు.