MP Raghurama: సునీత రెడ్డిలా పోరాటం చేయండి...

ABN , First Publish Date - 2022-09-21T21:17:50+05:30 IST

ఢిల్లీ (Delhi): పులివెందులలో సీబీఐ (CBI) విచారణ మళ్ళీ మొదలయ్యిందని రఘురామ అన్నారు.

MP Raghurama: సునీత రెడ్డిలా పోరాటం చేయండి...

ఢిల్లీ (Delhi): పులివెందులలో సీబీఐ (CBI) విచారణ మళ్ళీ మొదలయ్యిందని, సునీత రెడ్డి (Sunita Reddy) లాగా పోరాటం చేయండని ఎంపీ రఘురామ కృష్ణంరాజు (Raghurama Krishnamraju) పిలుపిచ్చారు. బుధవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ వైఎస్ వివేకానందరెడ్డి (Vivekanandareddy) హత్య (Murder) ఎవరో చేశారో త్వరలో బయటకు రావాలని కోరుకుంటున్నానన్నారు. అప్పుడే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి (CM Jagan) చిన్నాన్నకు అసలైన ఆత్మశాంతి కలుగుతుందన్నారు.


‘‘తెలంగాణలో ఒక చెల్లి (షర్మిల) మా నాన్నను చంపేశారని అంటున్నారు.. సడెన్‌గా ఒక రాయి వేసి జనాల దృష్టిలో అనుమానం వచ్చే విధంగా ఉంది... మీ మైండ్‌లో ‌ఏముందో చెప్పండి’’ అంటూ రఘురామ కృష్ణంరాజు వ్యాఖ్యానించారు.

Updated Date - 2022-09-21T21:17:50+05:30 IST