‘ఏ-1, ఏ-2 బిరుదులు జగన్, విజయసాయిలకే సొంతం’

ABN , First Publish Date - 2021-06-21T19:00:34+05:30 IST

కరోనా కష్టకాలంలో ప్రజలను ఆదుకోవాలని ఎంపీ రామ్మోహన్ నాయుడు డిమాండ్ చేశారు.

‘ఏ-1, ఏ-2 బిరుదులు జగన్, విజయసాయిలకే సొంతం’

శ్రీకాకుళం: కరోనా కష్టకాలంలో ప్రజలను ఆదుకోవాలని ఎంపీ రామ్మోహన్ నాయుడు డిమాండ్ చేశారు. తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి రూ.10 వేలు ఆర్థిక సహాయం అందించాలన్నారు. ఆక్సిజన్ కొరతతో చనిపోయిన కరోనా మరణాలు ప్రభుత్వ హత్యలుగానే భావించాలని తెలిపారు. కరోనా మృతుల కుటుంబాలకు రూ.25 లక్షలు పరిహారం అందించాలని ఎంపీ డిమాండ్ చేశారు. అన్నా కేంటిన్‌లను తెరిపించాలన్నారు. టీడీపీ సానుభూతిపరులకు సంక్షేమ పథకాలు దక్కనివ్వటం లేదని మండిపడ్డారు. మత్స్యశాఖ మంత్రి సొంత జిల్లాలోనే మత్యకారులకు అన్యాయం జరుగుతుందన్నారు. ఓట్ల కోసం జగన్ యువతను మోసం చేశారని విమర్శించారు. ప్రత్యేక హోదా విషయంలో మాట తప్పి, మడమ తిప్పారన్నారు. పబ్లిసిటీ కోసం జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేశారని అన్నారు. దేశంలో ఏ-1, ఏ-2 బిరుదులు జగన్, విజయసాయిరెడ్డిలకే సొంతమని ఎంపీ రామ్మోహన్‌నాయుడు యెద్దేవా చేశారు.

Updated Date - 2021-06-21T19:00:34+05:30 IST