దొర అహంకారంతో కేసీఆర్ పాలన: ఎంపీ సోయం

ABN , First Publish Date - 2022-03-17T19:31:57+05:30 IST

దొర అహంకారంతో సీఎం కేసీఆర్ పాలన చేస్తున్నారని ఎంపీ సోయం బాపురావు అన్నారు.

దొర అహంకారంతో కేసీఆర్ పాలన: ఎంపీ సోయం

హైదరాబాద్: దొర అహంకారంతో సీఎం కేసీఆర్ పాలన చేస్తున్నారని ఎంపీ సోయం బాపూరావు అన్నారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ... బీజేపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్.. అంబేడ్కర్‌ రాజ్యాంగానికి జరిగిన అవమానమన్నారు. ముఖ్యమంత్రి తానా అంటే.. స్పీకర్ తందాన అంటున్నారని మండిపడ్డారు. కేసీఆర్ అవినీతిని బయటపెడ్తారన్న కారణంగానే ముగ్గురు ఎమ్మెల్యేలను బయటకు పంపారని అన్నారు. తెలంగాణ విద్యార్థులను ఉక్రెయిన్ నుంచి రప్పించటంలో మోదీ ప్రత్యేక శ్రద్ధ చూపారని తెలిపారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం తెలంగాణకు అన్ని విషయాల్లో సాయం చేస్తోందని చెప్పారు. తెలంగాణ అభివృద్ధి ప్రధాని మోదీ పుణ్యమే అని అన్నారు. తెలంగాణలో రాబోయేది బీజేపీ ప్రభుత్వమే అని సోయం బాపూరావు స్పష్టం చేశారు. 

Updated Date - 2022-03-17T19:31:57+05:30 IST