ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ తీసుకోవాలి
ABN , First Publish Date - 2021-05-15T05:56:47+05:30 IST
కరోనాను ఎదుర్కోవటానికి వ్యాక్సిన్ ఎంతో ముఖ్యమని, ప్రతి ఒక్క రూ వ్యాక్సిన్ వేయించుకోవాలని నరసరావుపేట పార్లమెంట్ సభ్యు డు లావు శ్రీకృష్ణదేవరాయలు అన్నారు.
ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు
సత్తెనపల్లి, మే 14: కరోనాను ఎదుర్కోవటానికి వ్యాక్సిన్ ఎంతో ముఖ్యమని, ప్రతి ఒక్క రూ వ్యాక్సిన్ వేయించుకోవాలని నరసరావుపేట పార్లమెంట్ సభ్యు డు లావు శ్రీకృష్ణదేవరాయలు అన్నారు. పట్టణంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన కొవిడ్ వ్యాక్సినేషన్ కేంద్రాన్ని శుక్రవారం ఎమ్మెల్యే అంబటి రాంబాబుతో కలసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా బాధితులకు బెడ్లకొరత లేకుండా చూస్తున్నామని చెప్పారు. ఆక్సిజన్ సమస్యలేకుండా ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుందన్నారు. రెమ్డెసివిర్ ఇంజక్షన్లు సకాలంలో అందేలా చూస్తున్నామన్నారు. సత్తెనపల్లి నియోజకవర్గ పరిధిలోని సేఫ్ ఫార్మశీ కంపెనీలో ఇంజక్షన్ల తయారీకి అనుమతి ఇవ్వాలని కేంద్రాన్ని కోరినట్లు ఆయన చెప్పారు. కేంద్రం సుముఖంగా ఉందని అనుమతి లభిస్తే ఇంజక్షన్ల కొరత చాలా వరకు తీరుతుందన్నారు. వ్యాక్సిన్ కేంద్రంలోని సిబ్బందికి ఆయన పలు సూచనలిచ్చారు. వారి వెంట డాక్టర్ నాగపద్మజ, ఆరోగ్యసిబ్బంది తదితరులున్నారు.