సంతోష్ చెప్తేనే ఆ శాఖలో బదిలీలు: ఎంపీ ఉత్తమ్

ABN , First Publish Date - 2022-04-19T00:43:07+05:30 IST

రాష్ట్రంలో ఇంత వికృతమైన పరిపాలన ఊహించలేదు..కేసీఆర్ పాలన పోలీసులు, డబ్బు తో నడుస్తోందని ఎంపీ ఉత్తమ్ కుమార్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

సంతోష్ చెప్తేనే ఆ శాఖలో బదిలీలు: ఎంపీ ఉత్తమ్

హైదరాబాద్: రాష్ట్రంలో ఇంత వికృతమైన పరిపాలన ఊహించలేదు... కేసీఆర్ పాలన పోలీసులు, డబ్బుతో నడుస్తోందని ఎంపీ ఉత్తమ్ కుమార్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ. .. రాష్ట్రాన్ని ఒక కుటుంబం, కొంతమంది పోలీసు అధికారుల మాఫీయా నడిపిస్తోంది. టీఆర్ఎస్ నేతలు, పోలీసు అధికారుల వేధింపులు తాళలేక రామాయంపేటలో ఒక కుటుంబం బలైంది. వామన్‌రావు దంపతుల హత్య నడిరోడ్డుపై జరిగితే.. ఇంతవరకు దోషులను పట్టుకోలేదు.. కొత్తగూడెంలో ఎమ్మెల్యే కొడుకు చేసిన పనికి ఓ కుటుంబం ఆత్మహత్య చేసుకుంది.. విచారణ ఎక్కడికి వచ్చిందో ఎవరికి చెప్పరు. టీఆర్ఎస్‌ని బొంద పెట్టడం ఖాయం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో పోలీసులకు మంచి పేరు ఉండేది.. కానీ ఇప్పుడు కేసీఆర్ ఆ వ్యవస్థను నాశనం చేశారు.కేసీఆర్‌కు అనుకూలంగా పనిచేయని అధికారులను పక్కన పెడుతున్నారని ఎంపీ ఉత్తమ్ కుమార్‌రెడ్డి మండిపడ్డారు.


సంతోష్ చెప్తేనే..పోలీసు శాఖలో బదిలీలు..

‘‘కేసీఆర్ మేనల్లుడు సంతోష్ చెప్తేనే.. పోలీసు శాఖలో బదిలీలు జరుగుతున్నాయి. జిల్లా ఎస్పీ అంటే.. ఐపీఎస్ ఆఫీసర్లు ఉండే వారు.. ఇప్పుడు 20 మంది నాన్ ఐపీఎస్ అధికారులు ఉన్నారు. టీఆర్ఎస్‌కు సహాకరిస్తున్న వారికే.. ఎస్పీ పోస్టింగ్‌లు ఇస్తున్నారు. హైదరాబాద్ పరిధిలో డీసీపీ‌లు సంవత్సరాలు పైబడిన ఒకే దగ్గర పనిచేస్తున్నారు. మరికొందరికి అసలు పోస్టింగ్‌లే ఇవ్వలేదు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు లక్షల రూపాయలు తీసుకుని ఎస్ఐ, ఇతర పోస్టింగ్‌లకు రికమెండ్ చేస్తున్నారు. డబ్బులు తీసుకుని పోస్టింగ్‌లు ఇవ్వడం వల్లే.. రామాయంపేట లాంటి సంఘటనలు జరుగుతున్నాయి.. ఖమ్మంలో మున్సిపల్ కౌన్సిలర్ ముస్తఫాపై దొంగ కేసుపెడితే.. కోర్ట్ కొట్టేసింది. హుజూర్‌నగర్‌లో గోపీగౌడ్‌పై కేసు పెడితే.. ఇది తప్పుడు కేసు అని మాట్లాడితే పోలీసులు వినలేదు.. గోపీగౌడ్ టీఆర్ఎస్‌లో చేరిన తర్వాత వెంటనే కేసు తొలగించారు. ఎమ్మెల్యేలకు 5,6 పైలెట్ ఎస్కార్ట్‌లు ఎందుకు.. గ్రామాల్లో టీఆర్ఎస్ నేతలు అరాచకం చేస్తున్నారు అని’’ ఎంపీ ఉత్తమ్ కుమార్‌రెడ్డి ధ్వజమెత్తారు.

Updated Date - 2022-04-19T00:43:07+05:30 IST