పోలీసు కంట్రోల్ రూం ముందు మహిళ ఆత్మహత్య

ABN , First Publish Date - 2020-10-15T18:06:29+05:30 IST

పోలీసు కంట్రోల్ రూం సమీపంలో ఓ మహిళ ఆత్మహత్య చేసుకున్న ఘటన....

పోలీసు కంట్రోల్ రూం ముందు మహిళ ఆత్మహత్య

భోపాల్ (మధ్యప్రదేశ్): పోలీసు కంట్రోల్ రూం సమీపంలో ఓ మహిళ ఆత్మహత్య చేసుకున్న ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని దాటియా నగరంలో వెలుగుచూసింది. వినీతా యాదవ్ అనే మహిళ దాటియా పోలీసు కంట్రోల్ రూం సమీపంలోని చెట్టు వద్ద ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. వెంటనే పోలీసులు వచ్చి మహిళ మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. మహిళ ఆత్మహత్య చేసుకోవడానికి కారణాలు తెలియరాలేదు. 


మృతురాలి భర్త సునీల్ యాదవ్ ను పోలీసులు విచారిస్తున్నారు. వినీతాయాదవ్ తన పుట్టిల్లు అయిన ఝాన్సీ నుంచి దాటియాకు వచ్చిందని భర్త సునీల్ యాదవ్ చెప్పారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని డీఎస్పీ సమీత్ అగర్వాల్ చెప్పారు.

Updated Date - 2020-10-15T18:06:29+05:30 IST