AP News: లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఎంపీడీవో

ABN , First Publish Date - 2022-09-13T02:13:41+05:30 IST

బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా పి.గన్నవరం ఎంపీడీవో కేఆర్‌ విజయ సోమవారం రూ.40వేలు లంచం తీసుకుంటూ

AP News: లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఎంపీడీవో

గన్నవరం: బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా పి.గన్నవరం ఎంపీడీవో కేఆర్‌ విజయ సోమవారం రూ.40వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ (ACB) అధికారులకు పట్టుపడ్డారు. పి.గన్నవరం మండలం రాజులపాలెం గ్రామ పంచాయతీ పరిధిలోని శ్మశానవాటిక, కమ్యూనిటీహాల్‌, సీసీ రోడ్ల నిర్మాణం తదితర పనులు కోసం రూ.1.15కోట్ల ఎంపీ లాండ్స్‌ నిధులకు సంబంధించి 10శాతం మండలపరిషత్‌ నిధుల కోసం అనుమతులు ఇవ్వాలని రాజులపాలెం గ్రామ ఉపసర్పంచ్‌ ఎన్‌.విజయలక్ష్మి ఎంపీడీవో కేఆర్‌ విజయను కోరారు. అయితే ఈ పనిచేయడానికి రూ.50వేలు లంచం ఇవ్వాలని ఎంపీడీవో విజయ డిమాండ్‌ చేశారు. అనుకున్నట్లే ఈనెల 6న రూ.10వేలను ఎంపీడీవోకు ఉపసర్పంచ్‌ ఇచ్చారు. అనంతరం ఈనెల 10న ఎంపీడీవోపై  ఏసీబీకి  ఉపసర్పంచ్‌ ఫిర్యాదు చేశారు. మిగిలిన రూ.40 వేలు ఇవ్వాలని ఎంపీడీవో డిమాండ్‌ చేయగా మండలపరిషత్‌ కార్యాలయంలో ఎంపీడీవోకు సోమవారం ఉపసర్పంచ్‌ విజయలక్ష్మి రూ.40వేలు లంచం ఇస్తుండగా రెడ్‌హ్యాండడ్‌గా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఎంపీ లాండ్స్‌కు సంబంధించిన ఫైల్‌ను సీజ్‌ చేసి ఎంపీడీవోను అదుపులోకి తీసుకున్నారు. 

Updated Date - 2022-09-13T02:13:41+05:30 IST