కల్లూరు ఎంపీవో సస్పెన్షన్
ABN , First Publish Date - 2021-01-22T04:50:13+05:30 IST
కల్లూరు మండలపరిషత్ కార్యాలయంలో ఎంపీవోగా పనిచేసిన జి.శ్రీలక్ష్మీని సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్(పంచాయతీరాజ్ విభాగం)నుంచి ఈమేరకు గురువారం మండలపరిషత్ కార్యాలయానికి ఆదేశాలు అందాయి.
కల్లూరు, జనవరి 21: కల్లూరు మండలపరిషత్ కార్యాలయంలో ఎంపీవోగా పనిచేసిన జి.శ్రీలక్ష్మీని సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్(పంచాయతీరాజ్ విభాగం)నుంచి ఈమేరకు గురువారం మండలపరిషత్ కార్యాలయానికి ఆదేశాలు అందాయి. మండలపరిషత్ కార్యాలయంలో ఎంపీవోగా పనిచేసిన శ్రీలక్ష్మీ విధినిర్వహణలో పలు విధాలుగా అవినీతి అక్రమాలకు పాల్పడినట్లు కలెక్టర్ కార్యాలయానికి ఫిర్యాదులు అందాయి. గ్రామపంచాయతీల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలతోపాటు పారిశుధ్యంవంటి పనుల్లో సర్పంచ్ల నుంచి నేరుగా ముడుపులు అందుకున్నట్లు అదేవిధంగా చెక్కుల రూపంలో సర్పంచ్ల ఖాతాల నుంచి మళ్లించి నిధులు స్వాహాకు పాల్పడినట్లు పలుగ్రామాల సర్పంచ్లు మూకుమ్మడిగా ఎంపీవో శ్రీలక్ష్మీపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ జిల్లా అధికారులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదులు చేశారు. ఈమేరకు సర్పంచ్ల ఫిర్యాదుల ఆధారంగా కలెక్టర్ జిల్లా పంచాయతీ అధికారిచేత కూడా ఇటీవల ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీపీ రఘు, సర్పంచ్ల సమక్షంలో విచారణ జరిపారు. సదరు విచారణలో కూడా విధినిర్వహణలో ఎంపీవో శ్రీలక్ష్మీ వ్యవహరించిన తీరుపై పలువిధాలుగా విచారణ జరిపారు. పైవిచారణను దృష్టిలో ఉంచుకొని జిల్లా కలెక్టర్ ఎంపీవో శ్రీలక్ష్మీని సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీచేశారు.