ప్రాదేశిక ఎన్నికలకు సమాయత్తం

ABN , First Publish Date - 2021-02-28T03:33:02+05:30 IST

ప్రాదేశిక ఎన్నికలకు అధికారులు ముందస్తుగా సమాయత్తం అవుతున్నారు.

ప్రాదేశిక ఎన్నికలకు సమాయత్తం
ఓటర్ల జాబితా సిద్ధం చేస్తున్న పంచాయతీ కార్యదర్శులు

ఉదయగిరి రూరల్‌, ఫిబ్రవరి 27: ప్రాదేశిక ఎన్నికలకు అధికారులు ముందస్తుగా సమాయత్తం అవుతున్నారు. అందులో భాగంగా శనివారం స్థానిక మండల పరిషత్‌ కార్యాలయంలో ఎంపీడీవో వీరాస్వామి, ఈవోపీఆర్డీ ఆదినారాయణలు ఆధ్వర్యంలో పంచాయతీ కార్యదర్శులు పోలింగ్‌ కేంద్రాల వారీగా ఓటర్ల జాబితా సిద్ధం చేసే పనిలో నిమగ్నమయ్యారు. అధికారులు మాట్లాడుతూ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు ఎప్పుడు నిర్వహించినా సిద్ధంగా ఉండేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటతోపాటు బ్యాలెట్‌ బాక్సులను సైతం సిద్ధం చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శులు అమర్‌నాఽథ్‌రెడ్డి, సుధాకర్‌, కరిముల్లా, నాగూర్‌బీ, సీనియర్‌ అసిస్టెంట్‌ నవాజ్‌, సిబ్బంది ఇమ్రాన్‌, ఖాజా తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-02-28T03:33:02+05:30 IST