ఎంపీటీసీలకు విధులు, అధికారాలు కల్పించాలి
ABN , First Publish Date - 2020-09-29T08:13:28+05:30 IST
ఎంపీటీసీలకు విధులు, అధికారాలు కల్పించాలి
పంజాగుట్ట, సెప్టెంబరు 28(ఆంధ్రజ్యోతి): ఎంపీటీసీలు ఉత్సవ విగ్రహాలుగా మిగిలిపోతున్నారని తెలంగాణ రాష్ట్ర ఎంపీటీసీల సంఘం కన్వీనర్ గడిల కుమార్గౌడ్ ఆవేదన వ్యక్తం చేశారు. వారికి నిధులు, విధులు, అధికా రాలను స్థానిక సంస్థలకు బదలాయించాలని ప్రభుత్వాన్ని కోరారు. తమ సమస్యలను సీఎం కేసీఆర్, మంత్రులు ఎర్రబెల్లి , హరీశ్, ఈటల దృష్టికి తీసుకువెళ్లామన్నారు. కార్యాచరణ రూపొందించడానికి 1న రాష్ట్ర కార్యవర్గ సమావేశాన్ని నిర్వహిస్తామన్నారు.