లారీ ఢీకొని మహిళ మృతి

ABN , First Publish Date - 2020-12-02T05:59:11+05:30 IST

తిరుమలగిరిలో లారీ ఢీకొని మహిళ మృతి చెందింది.

లారీ ఢీకొని మహిళ మృతి

తిరుమలగిరి, డిసెంబరు 1 : తిరుమలగిరిలో లారీ ఢీకొని మహిళ మృతి చెందింది. ప్రత్యక్ష సాక్షులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ముని సిపల్‌ కార్యాలయం ఎదురుగా నివసిస్తున్న గిలకత్తుల అండాలు(45) ఇంటి ముందు నిల్చుండగా జనగామ నుంచి సూర్యాపేట వైపు వెళ్తున్న ఏపీ20టీఏ 0099 నెంబరు గల లారీ వేగంగా వచ్చి ఆమె పైనుంచి దూసుకెళ్లింది. టైర్ల కింద చిక్కుకుని కొంతదూరం ఈడ్చుకెళ్లడంతో ఆమె శరీరం ఛిద్రమై అక్కడికక్కడే మృతిచెందింది. అండాలుకు పిల్లలు లేకపోవడంతో భార్య, భర్తలు ఒకరికికొకరు తోడుగా ఉంటున్నారు. నన్ను ఒంటరి చేశావా అని భర్త వెంకన్న విలపించిన తీరు అందరినీ కన్నీరు పెట్టించింది. భర్త వెంకన్న ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కాగా ఈ ఘటనలో లారీ డ్రైవర్‌ పారిపోతుండగా స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. డ్రైవరు తాగి వాహనాన్ని నడిపాడని అతడి వద్ద మద్యం బాటిల్‌ ఉన్నట్లు తెలిపారు. మద్యం తాగినట్లు డ్రైవర్‌ ఒప్పుకున్నట్లు స్థానికులు తెలిపారు. 


Updated Date - 2020-12-02T05:59:11+05:30 IST