గుర్తుపట్టలేనంతగా మారిపోయిన ధోనీ

ABN , First Publish Date - 2022-02-27T02:44:05+05:30 IST

టీమిండియా మాజీ సారథి మహేంద్రసింగ్ ధోనీ గుర్తుపట్టలేనంతగా మారిపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో..

గుర్తుపట్టలేనంతగా మారిపోయిన ధోనీ

చెన్నై: టీమిండియా మాజీ సారథి మహేంద్రసింగ్ ధోనీ గుర్తుపట్టలేనంతగా మారిపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిపోయాడు. ఐపీఎల్‌ను బ్రాడ్‌కాస్ట్ చేయనున్న స్టార్‌స్పోర్ట్స్ రూపొందించిన ప్రమోషనల్ వీడియోలో కనిపించిన ధోనీ గుర్తుపట్టలేనంతగా ఉన్నాడు. ఖాకీ షర్ట్, ప్యాంట్ ధరించిన ధోనీ బస్ డ్రైవర్‌లా కనిపించాడు. అలాగే, కళ్లకు ఫంకీ సన్‌గ్లాసులు కూడా ధరించాడు. అందులో ధోనీ అవతారాన్ని చూసిన అభిమానులు మన ధోనీయేనా? అని ఆశ్చర్యపోతున్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో స్టార్‌స్పోర్ట్స్ షేర్ చేసిన ఈ వీడియో ఇప్పుడు బాగా వైరల్ అవుతోంది.


 ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌కు సారథ్యం వహిస్తున్న ధోనీ ఈసారి కూడా అభిమానులకు పసందైన విందు పంచేందుకు రెడీ అవుతున్నాడు. మార్చి 26 నుంచి ఐపీఎల్ ప్రారంభం కానుంది.ముంబై, పూణెలలోని నాలుగు వేదికల్లో మ్యాచ్‌లు జరగనున్నాయి. ఐపీఎల్‌లో ఈసారి లక్నో సూపర్ జెయింట్స్ (ఎల్ఎస్‌జీ), గుజరాత్ టైటాన్స్ (జీటీ) వచ్చి చేరడంతో తలపడే మొత్తం జట్ల సంఖ్య పదికి చేరింది. రెండు గ్రూపులుగా విడిపోయి తలపడనున్నాయి. 

Updated Date - 2022-02-27T02:44:05+05:30 IST