Hyd: మత్తు పదార్ధాలు కావాలంటూ యువకుల హల్చల్
ABN , First Publish Date - 2021-07-30T19:32:55+05:30 IST
మత్తు పదార్థాలు కావాలంటూ పాన్ షాపులో యువకులు హల్ చల్ చేశారు.
హైదరాబాద్: మత్తు పదార్థాలు కావాలంటూ పాన్ షాపులో యువకులు హల్ చల్ చేశారు. మత్తు పదార్థాలు లేవన్నందుకు షాపు యజమానిపై గొడవకు దిగారు. ఈ సంఘటన రాజకొండ కమిషనరేట్ పరిధి బోడుప్పల్లో జరిగింది. ఎమ్మెస్ పాన్ దర్బార్ షాపు వద్దకు ముగ్గురు యువకులు వచ్చారు. ఓబీసీ ప్రీమియమ్ పేపర్ అనే మత్తు పదార్థం కావాలంటూ హల్ చల్ చేశారు. అలాంటివి ఇక్కడ దొరకవని షాపు యజమాని సమాధానమిచ్చాడు. అయితే షాపు ఎందుకు తెరిచావంటూ అక్కడ షాపు ఫ్లెక్సీని చించేసి.. దాడికి ప్రయత్నించారు. దీంతో షాపు యజమాని మేడిపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. యువకులు హల్ చల్ చేసిన దృశ్యాలు సీసీ టీవీ కెమెరాలో రికార్డు అయ్యాయి.