ఎమ్మెల్యే రాజాసింగ్‌ దిష్టిబొమ్మ దహనం

ABN , First Publish Date - 2021-03-01T04:07:23+05:30 IST

ఎమ్మెల్యే రాజాసింగ్‌ దిష్టిబొమ్మను జడ్చర్లలోని అంబేడ్కర్‌ చౌరస్తా వద్ద కేవీపీఎస్‌ నాయకులు ఆదివారం దహనం చేశారు.

ఎమ్మెల్యే రాజాసింగ్‌ దిష్టిబొమ్మ దహనం
జడ్చర్లలో ఎమ్మెల్యే రాజాసింగ్‌ దిష్టిబొమ్మను దహనం చేస్తున్న కేవీపీఎస్‌ నాయకులు

జడ్చర్ల/పాలమూరు/భూత్పూర్‌, ఫిబ్రవరి 28: ఎమ్మెల్యే రాజాసింగ్‌ దిష్టిబొమ్మను జడ్చర్లలోని అంబేడ్కర్‌ చౌరస్తా వద్ద కేవీపీఎస్‌ నాయకులు ఆదివారం దహనం చేశారు. అలాగే ఎమ్మెల్యే రాజాసింగ్‌ సభ్యత్వాన్ని సభ్యత్వాన్ని రద్దు చేయాలని పాలమూరులో దళిత సంఘా ల ఐక్య కార్యాచరణ కమిటీ డిమాండ్‌ చేసింది. జిల్లా కేంద్రంలోని టీఎన్‌జీవోస్‌ భవనంలో ఎమ్మార్పీఎస్‌ రాష్ట్ర అధ్యక్షుడు మల్లెపోగు శ్రీనివాస్‌ మాట్లాడుతూ ఎమ్మెల్యే రాజాసింగ్‌ దళితుల పట్ల మాట్లాడిన తీరు సభ్య సమాజం తలదించుకునేలా ఉందన్నారు. ఎమ్మెల్యే రాజాసిం గ్‌ను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్‌ చేస్తూ ఆదివారం సీఐటీయూ, టీపీఎస్‌, ఎమ్మర్పీఎస్‌ నాయకులు భూత్పూర్‌ చౌరస్తాలో ధర్నా చేశారు. కార్యక్రమంలో టీపీఎస్‌ జిల్లా కన్వీనర్‌ కురుమూర్తి, ఎమ్మార్పీఎస్‌ మండల నాయకుడు వెంకటయ్య పాల్గొన్నారు.



Updated Date - 2021-03-01T04:07:23+05:30 IST