MTR Foods: ఏపీ, తెలంగాణలో విస్తృత శ్రేణి పొడులను విడుదల చేసిన ఎంటీఆర్‌ ఫుడ్స్‌

ABN , First Publish Date - 2022-09-14T03:29:08+05:30 IST

ఏపీ, తెలంగాణలో తన స్థానాన్ని సుస్థిరం చేసుకుని ప్రతి ఇంట్లోనూ రుచులకు ఘుమఘుమలు జోడిస్తున్న

MTR Foods: ఏపీ, తెలంగాణలో విస్తృత శ్రేణి పొడులను విడుదల చేసిన ఎంటీఆర్‌ ఫుడ్స్‌

హైదరాబాద్: ఏపీ, తెలంగాణలో తన స్థానాన్ని సుస్థిరం చేసుకుని ప్రతి ఇంట్లోనూ రుచులకు ఘుమఘుమలు జోడిస్తున్న ఎంటీఆర్ ఫుడ్స్ (MTR Foods) ఇప్పుడు ఈ రెండు రాష్ట్రాల్లో మరిన్ని పొడులను అందుబాటులోకి తీసుకొచ్చింది. తాజాదనం, పదార్థాల లభ్యత కారణంగా చాలామంది గృహిణులు అప్పటికప్పుడు పొడులు తయారుచేసుకోలేకపోతున్నారు. అలాంటి వారిని దృష్టిలో పెట్టుకుని తాజాదనం, రుచుల కలబోతతో కంది, ఇడ్లీకారం, కరివేపాకు పొడిని విడుదల చేసింది.


నిజానికి ఈ పొడులు తెలుగు వారికి చాలా ఇష్టమైనవి. వారిని దృష్టిలో పెట్టుకుని అత్యంత రుచికరమైన, ఇంట్లో తయారుచేసుకున్నంత రుచిగా వీటిని తీసుకొచ్చింది. నాణ్యమైన ముడి పదార్ధాలు మాత్రమే వినియోగించడం వల్ల సుదీర్ఘకాలం పాటు నిల్వ ఉండగలవనే భరోసాను ఎంటీఆర్ ఫుడ్స్ అందిస్తోంది. 20 గ్రాముల ప్యాక్‌ను 10 రూపాయలకు, 100 గ్రాముల ప్యాక్‌ను 45 రూపాయలకు అందిస్తోంది.

Updated Date - 2022-09-14T03:29:08+05:30 IST