బురద రహదారి

ABN , First Publish Date - 2021-07-21T05:36:43+05:30 IST

ఆస్పరి మండలం బిల్లేకల్‌ ప్రధాన రహదారి అధ్వానంగా తయారైంది.

బురద రహదారి


ఆస్పరి మండలం బిల్లేకల్‌ ప్రధాన రహదారి అధ్వానంగా తయారైంది. ఈ గ్రామం మీదుగా కర్నూలుకు వెళ్లాల్సి ఉండటంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇటీవలి వర్షాలకు రోడ్డు మీద గుంతలుపడి బురదమయంగా మారాయి. దీంతో వాహనదారులు నానాపాట్లు పడుతున్నారు. నిత్యం రద్దీగా ఉండే ఈ రహదారిని అధికారులు పట్టించుకోవడం లేదని ప్రజలు విమర్శిస్తున్నారు. అలాగే ఆస్పరి అంబేడ్కర్‌ కూడలిలో రోడ్డు పూర్తిగా ధ్వంసమైపోయింది. మంత్రి జయరాం ఈ సమస్యను పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు.                

                       - ఆలూరు



Updated Date - 2021-07-21T05:36:43+05:30 IST