ఏనుగు మృతి కేసులో ఇద్దరు నిందితుల అరెస్ట్
ABN , First Publish Date - 2021-01-23T18:34:23+05:30 IST
ఏనుగు మృతి కేసులో నిందితులైన ఇద్దరిని మదుమలై అటవీశాఖ అధికారులు అరెస్టు చేశారు.
చెన్నై (తమిళనాడు): ఏనుగు మృతి కేసులో ఇద్దరు నిందితులను మదుమలై అటవీశాఖ అధికారులు అరెస్టు చేశారు. తమిళనాడు రాష్ట్రంలోని మదుమలై అడవిలో అక్రమంగా కాటేజీ నడుపుతూ ఏనుగు మృతికి కారణమైన ఇద్దరిపై అటవీశాఖ అధికారులు కేసు నమోదు చేశారు. మాసినగుడి గ్రామంలోకి వచ్చిన ఏనుగును తరిమిగొట్టడానికి కాలుతున్న టైరు ముక్కను విసిరి వేయడంతో ఆ ఏనుగు తీవ్ర గాయాలతో మరణించింది.అడవి నుంచి గ్రామంలోకి చొరబడ్డ ఆ వన్యప్రాణిని తరిమికొట్టే ప్రయత్నంలో కొందరు వ్యక్తులు ఏనుగుపై కాలే టైరు ముక్కను విసరగా.. ఆ టైర్ ఏనుగు చెవిలో చిక్కుకుంది. దాంతో అది బాధతో అక్కడి నుంచి పారిపోయింది. కొన్ని రోజుల తర్వాత ఆ ఏనుగు మృత్యువాత పడింది. ఏనుగు మృతి కేసులో కాటేజీ యజమానులు ప్రసాద్, రేమాండ్ లను అరెస్టు చేసి, వారిపై వన్యప్రాణుల పరిరక్షణ చట్టం సెక్షన్ 9ప్రకారం కేసు నమోదు చేశారు.