రూ.592 కోట్లకు కంట్రీక్లబ్‌ను సొంతం చేసుకున్న ముకేశ్ అంబానీ

ABN , First Publish Date - 2021-04-23T22:19:24+05:30 IST

బ్రిటన్‌లోని రెండోతరం రాజకుటుంబానికి చెందిన తొలి కంట్రీక్లబ్ ‘స్టోక్ పార్క్’ను ముకేశ్ అంబానీ సారథ్యంలోని రిలయన్స్

రూ.592 కోట్లకు కంట్రీక్లబ్‌ను సొంతం చేసుకున్న ముకేశ్ అంబానీ

న్యూఢిల్లీ: బ్రిటన్‌లోని రెండోతరం రాజకుటుంబానికి చెందిన తొలి కంట్రీక్లబ్ ‘స్టోక్ పార్క్’ను ముకేశ్ అంబానీ సారథ్యంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ సొంతం చేసుకుంది. ఇంటర్నేషనల్ గ్రూప్ (ఐజీ)కి చెందిన ప్రతిష్ఠాత్మక కంట్రీక్లబ్, లగ్జరీ గోల్ఫ్ రిసార్ట్ అయిన ‘స్టోక్‌పార్క్’ను 57 మిలియన్ పౌండ్ల (దాదాపు రూ. 592 కోట్లు) కు కొనుగోలు చేసింది. ఈ మేరకు గురువారం రాత్రి పొద్దుపోయిన తర్వాత రిలయన్స్ ఇండస్ట్రియల్ ఇన్వెస్టిమెంట్ అండ్ హోల్డింగ్స్ లిమిటెడ్ (ఆర్ఐఐహెచ్ఎల్) ఒప్పందంపై సంతకం చేసింది.


వచ్చే నాలుగేళ్లలో మొత్తం 3.3 బిలియన్ల పెట్టుబడులు పెట్టనున్నట్టు రిలయన్స్ ఇండస్ట్రీస్ ప్రకటించింది. రిటైల్ రంగంలో 14 శాతం, టెక్నాలజీ, మీడియా, టెలికం (టీఎంటీ) రంగంలో 80 శాతం, ఎనర్జీ రంగంలో ఆరు శాతం పెట్టుబడులు పెట్టనున్నట్టు వివరించింది. రిలయన్స్ సొంతమైన లగ్జరీ స్పా, హోటల్, గోల్ప్ కోర్స్, కంట్రీక్లబ్‌ బకింగ్‌హామ్‌షైర్‌లో 300 ఎకరాల్లో విస్తరించి ఉంది. 

Updated Date - 2021-04-23T22:19:24+05:30 IST