Chief Minister: ఆ డ్యాం పటిష్ఠంగా ఉంది
ABN , First Publish Date - 2022-08-10T16:14:18+05:30 IST
ముల్లైపెరియార్ డ్యాం(Mullaiperiyar Dam) పటిష్ఠంగానే ఉందని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్కు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ లేఖ రాశారు. కేరళ
- కేరళ ముఖ్యమంత్రికి సీఎం స్టాలిన్ లేఖ
పెరంబూర్(చెన్నై), ఆగస్టు 9: ముల్లైపెరియార్ డ్యాం(Mullaiperiyar Dam) పటిష్ఠంగానే ఉందని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్కు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ లేఖ రాశారు. కేరళ సీఎం ఈ నెల 5న ముఖ్యమంత్రి స్టాలిన్కు రాసిన లేఖలో, ములైపెరియార్ పరివాహక ప్రాంతాల్లో కురుస్తున్న భారీవర్షాలను పరిగణనలోకి తీసుకొని, డ్యాంకు వచ్చి చేరుతున్న నీటి పరిమాణం కన్నా అదనపు నీటిని విడుదల చేయాలని, డ్యాం నుంచి నీటిని విడుదల చేసే ఒకరోజు ముందుగా తమకు సమాచారం అందించాలని కోరారు. ఈ లేఖపై ముఖ్యమంత్రి స్టాలిన్(Chief Minister Stalin) మంగళవారం కేరళ సీఎంకు రాసిన లేఖలో.. నిబంధనల ప్రకారం డ్యాం నుంచి నీరు విడుదల చేస్తున్నామన్నారు. డ్యాం పరివాహక ప్రాంతాల్లో నివసిస్తున్న కేరళ(Kerala) రాష్ట్ర ప్రజల భద్రతకు తమిళనాడు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని, వారి భద్రతకు చేపట్టాల్సిన ముందు జాగ్రత్త చర్యలను డ్యాం నిర్వహణ కమిటీ ఎప్పటికప్పుడు పరిశీలిస్తోందన్నారు.