తిరుమలలో మల్టీ లెవల్ పార్కింగ్
ABN , First Publish Date - 2021-04-10T00:13:12+05:30 IST
శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం తిరుమలలో మల్టీ లెవల్ పార్కింగ్ను ఏర్పాటు
తిరుమల: శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం తిరుమలలో మల్టీ లెవల్ పార్కింగ్ను ఏర్పాటు చేస్తామని టీటీడీ ఈవో జవహర్ రెడ్డి, అదనపు ఈవో ధర్మారెడ్డి తెలిపారు. తిరుమలలోని పలు ప్రాంతాలలో టీటీడీ ఈవో జవహర్ రెడ్డి తనిఖీలు నిర్వహించారు. తిరుమలలో పార్కింగ్ సమస్యను తీర్చేందుకు టీటీడీ అదనపు ఈవో, సీవీఎస్వోతో కలిసి తిరుమలలోని పలు ప్రదేశాలను ఈవో పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మట్లాడుతూ తిరుమలలో ప్రస్తుతం 4 వేల వాహనాలను పార్కింగ్ చేసే సౌకర్యం ఉందన్నారు. అయితే వాహనాల రద్దీ పెరుగుతున్న దృష్ట్యా 6 నుంచి 7వేల వాహనాలకు సరిపడేలా పార్కింగ్ ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు.
టైం స్లాట్ టోకెన్ల వైపు భక్తులు మొగ్గు చూపుతుండడంతో యాత్రికుల వసతి సముదాయం 5 నిర్మాణాన్ని నిలిపివేయాలని నిర్ణయించామని ఆయన తెలిపారు. ఈ స్థలంలో మల్టీ లెవల్ పార్కింగ్ను ఏర్పాటు చేస్తామని ఆయన ప్రకటించారు. అవసరమైతే భవిష్యత్తులో ముల్లగుంట, సేవా సదన్ల వద్ద మల్టీ లెవల్ పార్కింగ్ను ఏర్పాటు చేస్తామని అదనపు ఈవో ధర్మారెడ్డి తెలిపారు.