తరచూ దుబాయ్ వెళ్లే భారతీయులకు శుభవార్త

ABN , First Publish Date - 2022-08-27T13:05:33+05:30 IST

తరచుగా దుబాయ్‌ పర్యటనకు వెళ్లాలనుకునే భారతీయులకు శుభవార్త. త్వరలో మల్టిపుల్‌ ఎంట్రీ వీసాలను ప్రవేశపెట్టనున్నట్టు యూఏఈ ప్రకటించింది.

తరచూ దుబాయ్ వెళ్లే భారతీయులకు శుభవార్త

దుబాయ్‌కి మల్టిపుల్‌ ఎంట్రీ వీసా

న్యూఢిల్లీ, ఆగస్టు 26: తరచుగా దుబాయ్‌ పర్యటనకు వెళ్లాలనుకునే భారతీయులకు శుభవార్త. త్వరలో మల్టిపుల్‌ ఎంట్రీ వీసాలను ప్రవేశపెట్టనున్నట్టు యూఏఈ ప్రకటించింది. ఐదేళ్ల వరకు ఈ వీసాలకు గడువు ఉంటుంది. ఈ కాలంలో అనేకసార్లు యూఏఈకి వెళ్లి రావచ్చు. ప్రస్తుతం భారతీయులకు 30, 90 రోజుల వీసాలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. దీనివల్ల ఆయా వీసాల గడువు పూర్తయ్యాక మళ్లీ కొత్తగా దరఖాస్తు చేసుకోవాల్సి వస్తోంది. అంతేగాక దుబాయ్‌కి వెళ్లే భారతీయుల సంఖ్య ఏటా పెరుగుతోంది. 

Updated Date - 2022-08-27T13:05:33+05:30 IST