Muluguలో తెలంగాణ మంత్రుల పర్యటన
ABN , First Publish Date - 2022-03-05T15:13:53+05:30 IST
జిల్లాలో మంత్రులు హరీష్ రావు, ఎర్రబెల్లి దయాకరరావు, సత్యవతి రాథోడ్ పర్యటన కొనసాగుతోంది.
ములుగు: జిల్లాలో మంత్రులు హరీష్ రావు, ఎర్రబెల్లి దయాకరరావు, సత్యవతి రాథోడ్ పర్యటన కొనసాగుతోంది. ములుగు గట్టమ్మ ఆలయం నుంచి బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం జిల్లా ఆస్పత్రి భవన నిర్మాణానికి మంత్రులు శంకుస్థాపన చేశారు. అలాగే ములుగు ఏరియా ఆస్పత్రిలో రేడియాలజీ ల్యాబ్, పిడియాట్రిక్ యూనిట్ ప్రారంభోత్సవం జరిగింది. ఈ-హెల్త్ ప్రొఫైల్ను పైలెట్ ప్రాజెక్టుగా మంత్రి హరీష్ రావు ప్రారంభించారు.