IPL 2022: సన్‌రైజర్స్‌తో మ్యాచ్.. టాస్ గెలిచిన ముంబై

ABN , First Publish Date - 2022-05-18T00:49:35+05:30 IST

ఐపీఎల్‌లో భాగంగా మరికాసేపట్లో ముంబై ఇండియన్స్-సన్ రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడనున్నాయి. వాంఖడే

IPL 2022: సన్‌రైజర్స్‌తో మ్యాచ్.. టాస్ గెలిచిన ముంబై

ముంబై: ఐపీఎల్‌లో భాగంగా మరికాసేపట్లో ముంబై ఇండియన్స్-సన్ రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడనున్నాయి. వాంఖడే స్టేడియంలో జరగనున్న ఈ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ టాస్ గెలిచి హైదరాబాద్‌కు బ్యాటింగ్ అప్పగించింది. ముంబై జట్టు ఇప్పటికే ప్లే ఆఫ్స్ అవకాశాలు కోల్పోగా,  హైదరాబాద్‌కు ఇంకా ఆశలు మిగిలే ఉన్నాయి. అయితే, అందుకు మరిన్ని సమీకరణాలు తోడు కావాల్సి ఉంటుంది.  ఈ మ్యాచ్‌లో ముంబైపై భారీ తేడాతో విజయం సాధించడంతోపాటు ఇతర జట్ల జయాపజయాలపై హైదరాబాద్ ప్లే ఆఫ్స్ అవకాశాలు ఆధారపడి ఉన్నాయి. ఈ లెక్కన చూస్తే హైదరాబాద్ కూడా తట్టాబుట్టా సర్దుకోక తప్పదు. అయితే, చివరి వరకు పోరాడాలని విలియమ్సన్ జట్టు పట్టుదలగా ఉంది.


ఇక, ముంబై ఇప్పటి వరకు 12 మ్యాచులు ఆడి మూడింటిలో మాత్రమే విజయం సాధించి అట్టడుగున ఉంది. కాబట్టి ఈ మ్యాచ్‌తోపాటు మిగిలి ఉన్న మరో మ్యాచ్‌లోనూ గెలవడం ద్వారా గౌరవంగా నిష్క్రమించాలని రోహిత్ సేన భావిస్తోంది. ఆ జట్టులో రెండు మార్పులు చోటుచేసుకున్నాయి. మయాంక్ మార్కండే,  సంజయ్ యాదవ్ జట్టులోకి వచ్చారు. ఎస్ఆర్‌హెచ్ కూడా రెండు మార్పులతో బరిలోకి దిగుతోంది. శశాంక్, మార్కో జాన్సన్ స్థానాల్లో వరుసగా ప్రియం గార్గ్, ఫజల్ ఫరూఖీ జట్టులోకి వచ్చారు. ఈ రెండు ఇప్పటి వరకు పరస్పరం తలపడిన మ్యాచుల్లో ముంబై పదిసార్లు విజయం సాధించగా, హైదరాబాద్ 8 సార్లు గెలుపొందింది. మరి ఈ మ్యాచ్‌లో పై చేయి ఎవరిదో వేచి చూడాల్సిందే.

Updated Date - 2022-05-18T00:49:35+05:30 IST