IPL 2022: ముంబై ఎదుట ఓ మోస్తరు లక్ష్యం.. ఢిల్లీ భారం ఇక బౌలర్లపైనే
ABN , First Publish Date - 2022-05-22T03:09:57+05:30 IST
ప్లే ఆఫ్స్కు చేరుకోవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్లో ఢిల్లీ బ్యాటర్లు బ్యాట్లు ఝళిపించడంలో
ముంబై: ప్లే ఆఫ్స్కు చేరుకోవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్లో ఢిల్లీ బ్యాటర్లు బ్యాట్లు ఝళిపించడంలో విఫలమయ్యారు. 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 159 పరుగులు మాత్రమే చేసి ప్రత్యర్థి ఎదుట ఓ మోస్తరు లక్ష్యాన్ని ఉంచారు. కెప్టెన్ పంత్, రోవ్మన్ పావెల్ క్రీజులో ఉన్నప్పుడు పరుగులు పెట్టిన స్కోరు ఆ తర్వాత మందగించింది. మరోవైపు, ముంబై బౌలర్లు ఒత్తిడి పెంచడంతో క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయింది. దీంతో భారీ స్కోరు సాధిస్తుందనుకున్న ఢిల్లీ ఓ మోస్తరు స్కోరు మాత్రమే చేసి బౌలర్లపై భారం వేసింది.
ఢిల్లీ బ్యాటర్లలో రోవ్మన్ పావెల్ టాప్ స్కోరర్గా నిలిచాడు. 34 బంతుల్లో ఫోర్, 4 సిక్సర్లతో 43 పరుగులు చేయగా పంత్ 39 పరుగులు చేశాడు. పృథ్వీషా 24, సర్ఫరాజ్ ఖాన్ 10, అక్షర్ పటేల్ 19(నాటౌట్), శార్దూల్ ఠాకూర్ 4 పరుగులు చేశారు. ముంబై బౌలర్లలో బుమ్రాకు 3 వికెట్లు దక్కగా, రమణ్దీప్ సింగ్ రెండు వికెట్లు పడగొట్టాడు.