‘బుల్లి బాయ్’ కేసు.. ప్రధాన నిందితురాలి అరెస్ట్

ABN , First Publish Date - 2022-01-04T22:45:57+05:30 IST

దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించిన ‘బుల్లి బాయ్’ యాప్ కేసులో ప్రధాన నిందితురాలు పోలీసులకు చిక్కింది.

‘బుల్లి బాయ్’ కేసు.. ప్రధాన నిందితురాలి అరెస్ట్

ముంబై: దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించిన ‘బుల్లి బాయ్’ యాప్ కేసులో ప్రధాన నిందితురాలు పోలీసులకు చిక్కింది.  ఈ యాప్‌లో ముస్లిం మహిళల ఫొటోలను అప్‌లోడ్ చేసి వేలానికి పెట్టడం సంచలనమైంది. రాజకీయంగానూ పెను దుమారం రేపడంతో కదిలిన ముంబై పోలీసులు ఉత్తరాఖండ్‌లో ప్రధాన నిందితురాలిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం విచారణ కోసం ముంబై తీసుకురానున్నారు. 


ఇందుకోసం ఉత్తరాఖండ్ కోర్టులో ఆమెను ప్రవేశపెట్టి ట్రాన్సిట్ రిమాండ్ కోరనున్నారు. కాగా, ఈ కేసులో ఇది రెండో అరెస్ట్. 21 ఏళ్ల ఇంజినీరింగ్ విద్యార్థిని సోమవారం బెంగళూరులో అదుపులోకి తీసుకున్నారు. నిందితులైన వీరిద్దరూ ఒకరికొకరు తెలుసని పోలీసులు తెలిపారు. ఫేస్‌బుక్, ఇన్‌‌స్టాగ్రామ్ ద్వారా వీరిద్దరికీ పరిచయం అయినట్టు పేర్కొన్నారు. బుల్లి బాయ్ యాప్‌కు సంబంధించి నిందితురాలు మూడు ఖాతాలు నిర్వహిస్తున్నట్టు తేలింది. సహ నిందితుడైన విశాల్ కుమార్.. ఖల్సా సూపర్‌మిస్ట్ పేరుతో ఖాతా తెరిచినట్టు పోలీసులు వివరించారు.

Updated Date - 2022-01-04T22:45:57+05:30 IST