ఆమెను రైలు కిందకు తోసేందుకు ప్రయత్నించి..
ABN , First Publish Date - 2021-02-21T20:58:05+05:30 IST
మాట వినకపోతే ఎంతకైనా తెగించే మగాళ్లు రోజుకో చోట వార్తల్లోకి వస్తూనే ఉన్నారు.
మాట వినకపోతే ఎంతకైనా తెగించే మగాళ్లు రోజుకో చోట వార్తల్లోకి వస్తూనే ఉన్నారు. ముంబైకి చెందిన సుమేథి జాదవ్ అనే యువకుడు పెళ్లికి నిరాకరించిన ఓ యువతిని ఇలానే రైలు కిందకి తోసేయడానికి ప్రయత్నించాడు. గతంలో ఈ ఇద్దరూ ఓచోట పనిచేసేప్పుడు ఒకరినొకరు ఇష్టపడ్డారు. అయితే, జాదవ్ మద్యానికి బానిసయ్యాడని తెలుసుకుని ఆ యువతి అతణ్ణి దూరం పెట్టింది. అప్పటి నుంచి పెళ్లి చేసుకోవాలని ఆ యువతిని అతను బాగా వేధించడం మొదలుపెట్టాడు. అంథేరిలో ఈ యువతి రైలు ఎక్కుతుందని తెలిసి.. జాదవ్ ఆమెను వెంబడించాడు. అక్కడ మరోసారి ఆ యువతి పెళ్లికి నిరాకరించడంతో ఆగ్రహంతో ఊగిపోయిన జాదవ్.. రైలు వచ్చే సమయంలో ఆమెను రైలుకిందకు తోసేందుకు ప్రయత్నించాడు. ఆమె తీవ్రంగా ప్రతిఘటించడంతో ప్రమాదం తప్పింది. అయితే, తలకు బలంగా గాయం కావడంతో ఆస్పత్రిలో చేర్చారు. అక్కడి నుంచి పరారవుతున్న జాదవ్ను పోలీసులు పట్టుకున్నారు.