Mumbaiలో వయోజనులందరికీ కొవిడ్ టీకాలు

ABN , First Publish Date - 2022-04-06T12:49:48+05:30 IST

ముంబై నగరంలో 18 ఏళ్ల వయసు పైబడిన అర్హులైన వయోజనులందరికీ కొవిడ్ టీకాలు వేశామని బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ తాజాగా ప్రకటించింది...

Mumbaiలో వయోజనులందరికీ కొవిడ్ టీకాలు

ముంబై(మహారాష్ట్ర): ముంబై నగరంలో 18 ఏళ్ల వయసు పైబడిన అర్హులైన వయోజనులందరికీ కొవిడ్ టీకాలు వేశామని బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ తాజాగా ప్రకటించింది.ముంబై నగరంలో 92,36,500 మందికి కొవిడ్ టీకాలు వేయాలనే లక్ష్యం కాగా మంగళవారం నాటికి 92,42,888 మందికి రెండు డోసుల టీకాలు వేశామని బీఎంసీ తెలిపింది.దేశంలో ముంబై 100 శాతం మంది వయోజనులకు కొవిడ్ టీకాలు వేసి పూర్తి టీకా మైలురాయిని చేరుకున్నామని బీఎంసీ ఎగ్జిక్యూటివ్ హెల్త్ ఆఫీసర్ మంగళా గోమరే చెప్పారు. ముంబైలో 1,02,96,917 మంది 18 ఏళ్ల వయసు గల వారికి మొదటి డోసు వ్యాక్సిన్ వేశామన్నారు.కొవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమం విజయవంతం చేశామని అధికారులు వివరించారు. 


Updated Date - 2022-04-06T12:49:48+05:30 IST