TS News: మునావర్‌పైనా ఎందుకు పంచాయితీ పెడుతున్నారు?: కేటీఆర్

ABN , First Publish Date - 2022-08-27T19:37:11+05:30 IST

స్టాండప్‌ కమెడియన్‌ మునావర్‌ ఫారూఖీ (Munawar Faruqi)పై ఎందుకు పంచాయితీ పెడుతున్నారు

TS News: మునావర్‌పైనా ఎందుకు పంచాయితీ పెడుతున్నారు?: కేటీఆర్

హైదరాబాద్: స్టాండప్‌ కమెడియన్‌ మునావర్‌ ఫారూఖీ (Munawar Faruqi)పై ఎందుకు పంచాయితీ పెడుతున్నారు? అని మంత్రి కేటీఆర్ (KTR) ప్రశ్నించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ జీడీపీ, గ్యాస్‌, డీజిల్‌ పెట్రోల్‌ (GDP Gas Diesel Petrol) ధరలు పెరిగిపోతున్నాయని, దానిపై కేంద్రం పెద్దలు మాట్లాడటం లేదని నిలదీశారు. ప్రజలు ఏం తినాలో.. ఏం వినాలో కూడా డిక్టేట్‌ చేస్తున్నారని తప్పుబట్టారు. విద్యా, వైద్యం ఉచితంగా అందించలేని ప్రభుత్వాలు సిగ్గుపడాలన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్ట్‌ కాళేశ్వరమని కొనియాడారు. రూ.12 లక్షల కోట్లను కార్పొరేట్‌ ట్యాక్స్‌లను రద్దు చేస్తారు.. కానీ బియ్యం, ఉచిత విద్యుత్‌ ఇస్తే మాత్రం తప్పుపడుతున్నారని కేంద్రంపై కేటీఆర్‌ మండిపడ్డారు. 

Updated Date - 2022-08-27T19:37:11+05:30 IST